"శాస్తారం ప్రణమామ్యహం" అంటూ శాస్త అయిన మణికంఠున్ని పూజించి, అర్చకులకి నమస్కరించి, భక్తులను ఆదరించి, అయ్యప్ప తత్వమును అనుసరించి, అవసరంలో ఉన్నవాళ్ళకు ఉపాధి కలిపించి, వివిధ సేవలు చేసి అయ్యప్ప కృపకు పాత్రులయ్యారు ఈ నిర్వాహకులు.
ఎప్పటికప్పుడు భక్తులందరికీ అవసరమైన ఏర్పాట్లు చేస్తూ, వారికి కలిగే అసౌకర్యాలను తగ్గిస్తూ, దీక్షకు కావల్సిన సదుపాయాలను కల్పిస్తూ, అన్నదానాలు, వివిధ అభిషేకాలు, శబరి యాత్రలకు ఏర్పాట్లు జరిపిస్తూ, మండల పూజలు బ్రహ్మాండంగా నిర్వహిస్తూ, మంగళ స్వరూపుడైన ఆయ్యప్ప దర్శనాన్ని భక్తులకు కలిపిస్తూ ఆ పుణ్యమూర్తి సేవలో నిమగ్నులయ్యారు.
పరంజ్యోతియే శరణమయ్యప్ప !
మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప !!
మాలికాపురత్తు లోకదేవిమాతావే శరణమయ్యప్ప !!!
మాజీ సభ్యులు (స్వర్గీయులు)