సన్మార్గంలో ఉన్న వారైనా, దుర్మార్గంలో ఉన్న వారైనా, ఎవరైనా సరే భగవంతుని నమ్మగలిగే వారైయుండి, భక్తిశ్రద్దలతో అయ్యప్పదీక్షను స్వీకరించి, నియమ నిష్ఠలను పాటిస్తే అయ్యప్ప వారిని ఆదరించి, భక్తి మార్గాన నడిపించి, భక్తి భావాలతో నిండిన క్రొత్త తేజస్సును ఇస్తాడు.
అయ్యప్ప దీక్ష ధర్మాధర్మవిచక్షణా జ్ఞానాన్ని మరింతగా వృద్ధి చేస్తుంది. దీక్ష స్వీకరించినవారికి సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతుంది. స్వామి మహిమల్ని దర్శించగలుగుతారు. మరిన్ని మహిమల్ని కన్నులార దర్శించాలనే ఉద్దేశం మీకుంటే 41 రోజులు దీక్షను సరియైన రీతిలో ఆచరించి, ఇరుముడితో వనయాత్ర చేసి చూడండి. అయ్యప్ప దీక్ష యొక్క "మహిమ" ఏమిటో మీకే తెలుస్తుంది !!!
మీరు కూడా మీ అనుభూతులను ఇతరులతో పంచుకోదలిచినచో మమ్మల్ని సంప్రదించగలరు.
విల్లాళివీరనే శరణమయ్యప్ప !
వీర మణికంఠనే శరణమయ్యప్ప !!
హరిద్వార్ నివాసియే శరణమయ్యప్ప !!!