శ్రీ శాస్తా దేవస్థానము, ఖమ్మం 1983-84 సంవత్సర కాలంలో ప్రజాదరణ కలిగిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు
శ్రీ హెచ్. హెచ్. స్వామి విమోచనానందా దేశ వ్యాప్తంగా అయ్యప్ప దేవాలయాల ఏర్పాటు కార్యక్రమానికి మార్గదర్శక శక్తిగా ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో శ్రీరంగపట్నం, కరుప్పతూర్(కేరళ), వారణాసి, హరిద్వార్, విజయవాడ (గొల్లపుడి),
పాల్వంచ (ఖమ్మం), మండపేట (ప.గో.) వంటి ప్రాంతాల్లో అయ్యప్ప దేవాలయాలు ఏర్పాటయ్యాయి.
1986 సంవత్సరంలో శ్రీ హెచ్.హెచ్. స్వామి విమోచనానందా ఈ గుడికి పునాది రాయి వేసారు. ఆగమ శాస్త్రానుసారం అయ్యప్పస్వామి గుడితో పాటు శ్రీ విఘ్నేశ్వర, నాగరాజ, మల్లికాపురతమ్మ దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళ నిర్మాణం జరిగింది. స్వచ్ఛంద నమోదు క్రమసంఖ్య : 505/1983
అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట: అయ్యప్ప విగ్రహం పంచలోహాలతో (బంగారు, వెండి, రాగి, ఇనుము మరియు తగరం) తయారుచేశారు. అనేక వేల భక్తుల సమక్షంలో విగ్రహం యొక్క ప్రధానమైన ఆకృతిని కుంబకోణానికి చెందిన శిల్పులు తయారు చేశారు.
ధ్వజస్తంభం: 39 అడుగుల ఎత్తు గల ధ్వజస్తంభం పూర్తిగా ఇత్తడితో కప్పబడి ఉన్నది. అయ్యప్ప స్వామి పూజలన్నీ కేరళ పూజారులు (నంబూద్రి) కేరళ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. మరికొన్ని వివరాలు...
ఓం స్వామియే శరణమయ్యప్ప !
మాతా-పితా-గురు-దైవమే శరణమయ్యప్ప !!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప !!!